Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త అవతారం.. నిర్మాతగా, దర్శకురాలిగా ఎంట్రీ
- సోదరితో కలిసి 'దోస డైరీస్' నిర్మాణ సంస్థ ప్రారంభం
- తొలి చిత్రంగా 'సరస్వతి' అనే థ్రిల్లర్ సినిమా ప్రకటన
- వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, ప్రియమణి
విలక్షణ నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్లో మరో కీలక అడుగు వేశారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, దర్శకనిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి 'దోస డైరీస్' పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్పై తొలి చిత్రంగా 'సరస్వతి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటిస్తుండటం విశేషం. ఇది ఒక హై-ఆక్టేన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనుంది. విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో 'సరస్వతి' పేరులోని 'తి' అక్షరాన్ని ఎరుపు రంగులో హైలైట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
తన కొత్త ప్రయాణం గురించి వరలక్ష్మి స్పందిస్తూ.. "దోస డైరీస్ మొదటి పేజీ సరస్వతి మీ ముందుకు రాబోతుంది. మా ప్రయాణం ఈరోజు ప్రారంభమైంది. రాబోయే పేజీలు మరింత ప్రకాశవంతంగా ఉంటాయి" అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే, పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకురాలిగా, నిర్మాతగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఈ చిత్రానికి వరలక్ష్మి దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటిస్తుండటం విశేషం. ఇది ఒక హై-ఆక్టేన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనుంది. విడుదల చేసిన టైటిల్ పోస్టర్లో 'సరస్వతి' పేరులోని 'తి' అక్షరాన్ని ఎరుపు రంగులో హైలైట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
తన కొత్త ప్రయాణం గురించి వరలక్ష్మి స్పందిస్తూ.. "దోస డైరీస్ మొదటి పేజీ సరస్వతి మీ ముందుకు రాబోతుంది. మా ప్రయాణం ఈరోజు ప్రారంభమైంది. రాబోయే పేజీలు మరింత ప్రకాశవంతంగా ఉంటాయి" అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే, పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకురాలిగా, నిర్మాతగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.