Pawan Kalyan: సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రండి: పవన్ కల్యాణ్కు లోకేశ్ విషెస్
- గత నాలుగు రోజులుగా పవన్ కల్యాణ్ కు జ్వరం
- ఈ నెల 25న విడుదలైన ఓజీ
- అభిమానులతో కలిసి ఓజీ విజయోత్సవాన్ని జరుపుకోవాలని పవన్ కు లోకేశ్ సూచన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. దీనిపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, 'ఓజీ' చిత్రం విజయం సాధించడంపైనా తన అభినందనలు తెలియజేశారు.
పవన్ కల్యాణ్ త్వరగా శక్తిని పుంజుకుని, పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. "ఆంధ్రప్రదేశ్కు మీ సేవలను కొనసాగిస్తూ మాకు స్ఫూర్తినివ్వాలి. అలాగే, మీ అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి 'ఓజీ' సినిమా అద్భుత విజయాన్ని మీరు జరుపుకోవాలి" అని లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం 'ఓజీ' సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలన్నీ పాజిటివ్ గా ఉండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు.
పవన్ కల్యాణ్ త్వరగా శక్తిని పుంజుకుని, పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. "ఆంధ్రప్రదేశ్కు మీ సేవలను కొనసాగిస్తూ మాకు స్ఫూర్తినివ్వాలి. అలాగే, మీ అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి 'ఓజీ' సినిమా అద్భుత విజయాన్ని మీరు జరుపుకోవాలి" అని లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం 'ఓజీ' సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలన్నీ పాజిటివ్ గా ఉండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు.