India vs Bangladesh: అభిషేక్ శర్మ మెరుపులు.. అయినా తడబడిన భారత్.. బంగ్లా టార్గెట్ 169
- ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్తో భారత్ ఢీ
- మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ
- 37 బంతుల్లో 75 రన్స్తో రప్ఫాడించిన యువ ఓపెనర్
- నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసిన టీమిండియా
- టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి బంగ్లా బౌలర్గా ముస్తాఫిజుర్ రికార్డు
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జాకర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు చేసి బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోరు చేసేలా కనిపించింది.
అయితే, అభిషేక్ ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం తగ్గింది. ఈ క్రమంలోనే జట్టు ఐదు వికెట్లు కోల్పోయినా, సంజూ శాంసన్ను బ్యాటింగ్కు పంపాలన్న ఆలోచన జట్టు యాజమాన్యం చేయలేదు. చివరలో హార్దిక్ బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు మోస్తరు స్కోర్ చేయగలిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుతమైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో భారత్ విఫలమైంది.
ఇదే మ్యాచ్లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. కాగా, ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో టీమిండియా 169 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది.
అయితే, అభిషేక్ ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం తగ్గింది. ఈ క్రమంలోనే జట్టు ఐదు వికెట్లు కోల్పోయినా, సంజూ శాంసన్ను బ్యాటింగ్కు పంపాలన్న ఆలోచన జట్టు యాజమాన్యం చేయలేదు. చివరలో హార్దిక్ బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు మోస్తరు స్కోర్ చేయగలిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుతమైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో భారత్ విఫలమైంది.
ఇదే మ్యాచ్లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. కాగా, ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో టీమిండియా 169 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది.