Gold Price: సరికొత్త రికార్డుకు చేరుకున్న బంగారం ధర.. ఈ క్యాలెండర్ ఏడాదిలో రూ.40 వేలు పెరిగిన ధర

Gold Price Reaches New Record High In India
  • ఢిల్లీలో రూ. 2,700 పెరిగి రూ. 1,18,900 చేరుకున్న బంగారం ధర
  • క్యాలెండర్ ఏడాదిలో 50.60 శాతం పెరిగిన పసిడి ధర
  • రూ. 1,39,600కు చేరిన వెండి ధర
బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అమెరికా హెచ్-1బీ వీసా రుసుము పెంపుదల ప్రభావం కూడా దీనిపై కనిపిస్తోంది. రూపాయి విలువ మరింత దిగజారడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 2,700 పెరిగి రూ. 1,18,900కు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి గత మార్కెట్ సెషన్‌లో పది గ్రాములకు రూ. 1,16,200 వద్ద ముగిసింది.

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వల్లనే బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 39,950 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 బంగారం ధర రూ. 78,950 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.

వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కిలో వెండి రూ. 3,220 పెరిగి రూ. 1,39,600కు చేరి, సరికొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో వెండి ధర ఏకంగా రూ.49,900 పెరిగింది. డిసెంబర్ 31న వెండి ధర రూ. 89,700గా ఉంది. మరోవైపు, డాలర్ మారకంతో రూపాయి మంగళవారం 47 పైసలు క్షీణించి 88.75కు పడిపోయింది.
Gold Price
Gold Rate Today
Gold price increase
Silver Price
Rupee vs Dollar
H-1B Visa
Delhi Gold Rate

More Telugu News