Khyber Pakhtunkhwa: సొంత భూభాగంపై పాక్ సైన్యం వైమానిక దాడి.. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 30 మంది పౌరులు హతం
- కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో భాగంగా ఓ గ్రామంపై సైన్యం దాడి
- మృతుల్లో మహిళలు, చిన్నారులు
- ఇళ్ల శిథిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండవచ్చని సందేహాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
పాకిస్థాన్ సైన్యం సొంత భూభాగంలోనే వైమానిక దాడులకు పాల్పడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఓ గ్రామంపై మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 8 బాంబులు జారవిడిచింది. ఈ దాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన కలవరపరిచే దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరాహ్ వ్యాలీలోని మాత్రె ధారా గ్రామంపై జరిగిన ఈ దాడిలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ ప్రావిన్స్ లో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 605 ఉగ్రవాద దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 138 మంది సామాన్యులు, 79 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఒక్క ఆగస్టు నెలలోనే 129 ఉగ్ర దాడులు జరిగాయని, ఈ ఘటనల్లో ఆరుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ ప్రావిన్స్ లో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 605 ఉగ్రవాద దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 138 మంది సామాన్యులు, 79 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఒక్క ఆగస్టు నెలలోనే 129 ఉగ్ర దాడులు జరిగాయని, ఈ ఘటనల్లో ఆరుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు.