Amit Shah: నేటి నుంచి కొత్త జీఎస్టీ... ప్రతిపక్షాల విమర్శలపై అమిత్ షా స్పందన
- 4 శ్లాబుల స్థానంలో ఇకపై 5%, 18%తో రెండే శ్లాబులు
- కారు, టీవీ, నిత్యావసరాలు సహా అనేక వస్తువుల ధరల చౌక
- నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థగా అభివర్ణించిన అమిత్ షా
దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత చేపట్టిన అతిపెద్ద సంస్కరణల్లో భాగంగా పలు వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ మార్పుల ద్వారా దేశంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పరస్పర విశ్వాసంతో కూడిన సరికొత్త శకం ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
కొత్త విధానం ప్రకారం, ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబుల స్థానంలో కేవలం 5%, 18% అనే రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. ఈ మార్పుల వల్ల నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఆరోగ్య బీమా, విద్యుత్, సిమెంట్, కార్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి అనేక ఉత్పత్తులు చౌకగా లభించనున్నాయి. అత్యంత విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను విధించనుండగా, పొగాకు ఉత్పత్తులు మాత్రం పాత 28% ప్లస్ సెస్ పరిధిలోనే కొనసాగుతాయి.
ఈ సంస్కరణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, "ఇది దేశంలో నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థకు నాంది పలుకుతుంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికే పన్నులు విధిస్తారనే భావనను ఇది తొలగిస్తుంది. దేశాన్ని నడపడానికే పన్నులు వసూలు చేస్తారనే నమ్మకాన్ని 130 కోట్ల ప్రజల్లో కలిగిస్తుంది" అని వివరించారు. ఈ నిర్ణయంతో దేశంలో ఉత్పత్తి, వినియోగం రెండూ పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సంస్కరణలను 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా వేసిన పెద్ద అడుగుగా అభివర్ణించారు. నవరాత్రుల మొదటి రోజున దేశంలో 'జీఎస్టీ పొదుపు పండుగ' ప్రారంభం కాబోతోందని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు యువత, మహిళలు, వ్యాపారులకు ఈ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు.
ఇదే సమయంలో ప్రతిపక్షాలపై అమిత్ షా విమర్శలు చేశారు. "కొందరు రాజకీయ నాయకులు జీఎస్టీని అపఖ్యాతి పాలు చేశారు. అది విజయవంతమవడం చూసి, ఆ ఆలోచన మాదేనంటూ ముందుకు వచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు ఎందుకు అమలు చేయలేకపోయారు?" అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలు రాజ్యాంగ హామీ కోరగా, వారు ఇవ్వలేకపోయారని, కానీ మోదీ ప్రభుత్వం ఆ హామీ ఇచ్చి రాష్ట్రాల నమ్మకాన్ని చూరగొన్నందునే జీఎస్టీ విజయవంతమైందని షా స్పష్టం చేశారు.
కొత్త విధానం ప్రకారం, ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబుల స్థానంలో కేవలం 5%, 18% అనే రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. ఈ మార్పుల వల్ల నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఆరోగ్య బీమా, విద్యుత్, సిమెంట్, కార్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి అనేక ఉత్పత్తులు చౌకగా లభించనున్నాయి. అత్యంత విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను విధించనుండగా, పొగాకు ఉత్పత్తులు మాత్రం పాత 28% ప్లస్ సెస్ పరిధిలోనే కొనసాగుతాయి.
ఈ సంస్కరణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, "ఇది దేశంలో నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థకు నాంది పలుకుతుంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికే పన్నులు విధిస్తారనే భావనను ఇది తొలగిస్తుంది. దేశాన్ని నడపడానికే పన్నులు వసూలు చేస్తారనే నమ్మకాన్ని 130 కోట్ల ప్రజల్లో కలిగిస్తుంది" అని వివరించారు. ఈ నిర్ణయంతో దేశంలో ఉత్పత్తి, వినియోగం రెండూ పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సంస్కరణలను 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా వేసిన పెద్ద అడుగుగా అభివర్ణించారు. నవరాత్రుల మొదటి రోజున దేశంలో 'జీఎస్టీ పొదుపు పండుగ' ప్రారంభం కాబోతోందని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు యువత, మహిళలు, వ్యాపారులకు ఈ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు.
ఇదే సమయంలో ప్రతిపక్షాలపై అమిత్ షా విమర్శలు చేశారు. "కొందరు రాజకీయ నాయకులు జీఎస్టీని అపఖ్యాతి పాలు చేశారు. అది విజయవంతమవడం చూసి, ఆ ఆలోచన మాదేనంటూ ముందుకు వచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు ఎందుకు అమలు చేయలేకపోయారు?" అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలు రాజ్యాంగ హామీ కోరగా, వారు ఇవ్వలేకపోయారని, కానీ మోదీ ప్రభుత్వం ఆ హామీ ఇచ్చి రాష్ట్రాల నమ్మకాన్ని చూరగొన్నందునే జీఎస్టీ విజయవంతమైందని షా స్పష్టం చేశారు.