IRCTC: సాయి భక్తుల కోసం ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- రూ.5 వేలకే షిర్డీ యాత్ర.. రెండు రోజుల టూర్
- రానూపోనూ ప్రయాణం, షిర్డీలో వసతి సదుపాయం
- హోటల్ నుంచి ఆలయం వరకూ వాహనం ఏర్పాటు
షిర్డీ సాయిబాబా భక్తుల కోసం రైల్వే శాఖ స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా రెండు రోజుల్లో యాత్రను పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ‘‘సాయి సన్నిధి’’ పేరుతో ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ వివరాలు.. ప్రతి బుధవారం కాచిగూడ నుంచి రైలు ప్రారంభమవుతుంది. బాసర, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ లో ప్రయాణించవచ్చు. ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైలులో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ వాహనం, వసతి, ఉచితంగా ఉదయం అల్పాహారం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 12 వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు మరియు బుకింగ్ కోసం ఐఆర్ సీటీసీ వెబ్సైట్ను సందర్శించండి.
ప్రతీ బుధవారం..
కాచిగూడ నుంచి బుధవారం సాయంత్రం 6.40 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్ప్రెస్) ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణించి గురువారం ఉదయం 7.10 గంటలకు నాగర్సోల్ రైల్వేస్టేషన్ చేరుకుంటారు. ఐఆర్ సీటీసీ సిబ్బంది ప్రత్యేక వాహనంలో షిర్డీలో హోటల్ కు తీసుకెళ్లి, రెడీ అయ్యాక ఆలయ సందర్శనకు తీసుకెళతారు. దర్శనం టికెట్ ఖర్చు ప్యాకేజీలో భాగం కాదు కాబట్టి సొంతంగా కొనుగోలు చేయాలి.
దర్శనం తర్వాత హోటల్ కు చేరుకుని కాసేపు విశ్రమించే వీలుంటుంది. సాయంత్రం 5 గంటలకు చెక్ అవుట్.. అక్కడి నుంచి తిరిగి నాగర్సోల్ స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు 17063 రైలు ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణించి శుక్రవారం ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటారు.
ఛార్జీలు.. కంఫర్ట్ ప్యాకేజీ..
3 ఏసీలో ప్రయాణం. రూమ్కు రూ.7,890 (సింగిల్ షేరింగ్), రూ.6,660 (డబుల్ షేరింగ్), రూ.6,640 (ట్రిపుల్ షేరింగ్). 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.5,730 (విత్ బెడ్), రూ.5,420(విత్అవుట్ బెడ్).
స్టాండర్డ్ ప్యాకేజీలో..
రూమ్కు రూ.6,220 (సింగిల్ షేరింగ్), రూ.4,980 (డబుల్ షేరింగ్), రూ.4,960 (ట్రిపుల్ షేరింగ్). 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.4,060 (విత్ బెడ్), రూ.3,750 (విత్ అవుట్ బెడ్).
ప్రతీ బుధవారం..
కాచిగూడ నుంచి బుధవారం సాయంత్రం 6.40 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్ప్రెస్) ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణించి గురువారం ఉదయం 7.10 గంటలకు నాగర్సోల్ రైల్వేస్టేషన్ చేరుకుంటారు. ఐఆర్ సీటీసీ సిబ్బంది ప్రత్యేక వాహనంలో షిర్డీలో హోటల్ కు తీసుకెళ్లి, రెడీ అయ్యాక ఆలయ సందర్శనకు తీసుకెళతారు. దర్శనం టికెట్ ఖర్చు ప్యాకేజీలో భాగం కాదు కాబట్టి సొంతంగా కొనుగోలు చేయాలి.
దర్శనం తర్వాత హోటల్ కు చేరుకుని కాసేపు విశ్రమించే వీలుంటుంది. సాయంత్రం 5 గంటలకు చెక్ అవుట్.. అక్కడి నుంచి తిరిగి నాగర్సోల్ స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు 17063 రైలు ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణించి శుక్రవారం ఉదయం 9.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటారు.
ఛార్జీలు.. కంఫర్ట్ ప్యాకేజీ..
3 ఏసీలో ప్రయాణం. రూమ్కు రూ.7,890 (సింగిల్ షేరింగ్), రూ.6,660 (డబుల్ షేరింగ్), రూ.6,640 (ట్రిపుల్ షేరింగ్). 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.5,730 (విత్ బెడ్), రూ.5,420(విత్అవుట్ బెడ్).
స్టాండర్డ్ ప్యాకేజీలో..
రూమ్కు రూ.6,220 (సింగిల్ షేరింగ్), రూ.4,980 (డబుల్ షేరింగ్), రూ.4,960 (ట్రిపుల్ షేరింగ్). 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.4,060 (విత్ బెడ్), రూ.3,750 (విత్ అవుట్ బెడ్).