Pawan Kalyan: తెలంగాణలో పవన్ కల్యాణ్ 'ఓజీ' స్పెషల్ షోకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేటు ఎంతంటే?
- పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక అనుమతి
- విడుదలకు ముందు రోజు రాత్రి స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్
- సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు షో ప్రదర్శనకు అవకాశం
- టికెట్ ధరను రూ. 800 వరకు పెంచుకోవచ్చని వెసులుబాటు
- పవర్ స్టార్ అభిమానులకు ముందుగానే పండగ వాతావరణం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదల రోజుకు ఒకరోజు ముందు ప్రత్యేక ప్రదర్శనలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
'ఓజీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న తేదీకి ముందు రోజు, అంటే సెప్టెంబర్ 24వ తేదీన రాత్రి 9 గంటలకు ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసుకునేందుకు చిత్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం టికెట్ ధరను గరిష్ఠంగా రూ. 800 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. విడుదల రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం వీలు కల్పించింది. సింగిల్ స్క్రీన్లో రూ. 100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్లో రూ. 150 (జీఎస్టీతో కలిపి) పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.
'ఓజీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న తేదీకి ముందు రోజు, అంటే సెప్టెంబర్ 24వ తేదీన రాత్రి 9 గంటలకు ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసుకునేందుకు చిత్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం టికెట్ ధరను గరిష్ఠంగా రూ. 800 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. విడుదల రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం వీలు కల్పించింది. సింగిల్ స్క్రీన్లో రూ. 100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్లో రూ. 150 (జీఎస్టీతో కలిపి) పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.