అమెరికాలో ప్రమాదవశాత్తు తెలంగాణ వాసి మృతి
- 2016లో అమెరికా వెళ్లిన మహబూబ్ నగర్ పట్టణవాసి అమీరుద్దీన్
- స్నేహితుల మధ్య గొడవ జరగగా కాల్పులు జరిపిన పోలీసులు
- ప్రమాదవశాత్తు ఒక తుటా తగలడంతో ప్రాణాలు కోల్పోయిన అమీరుద్దీన్
ఈ క్రమంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరగగా, వారిలో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్నేహితుల మధ్య వివాదం సద్దుమణగకపోవడంతో కాల్పులు జరిపారు. దురదృష్టవశాత్తు ఒక బుల్లెట్ అమీరుద్దీన్కు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చికాగోలో ఉంటున్న మృతుడి మామయ్య ఘటనాస్థలానికి వెళ్ళారు. అతను మృతి చెందిన విషయాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.