తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ... రాష్ట్ర కార్యవర్గంలో ఎవరెవరు ఉన్నారంటే..!
- తీన్మార్ మల్లన్న నుంచి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన
- ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (టీఆర్పీ)గా నామకరణం
- పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మల్లన్న
- అధ్యక్షుడిగా మల్లన్న, ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం
- ప్రధాన కార్యదర్శులుగా నలుగురికి అవకాశం
ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలయికతో ఈ జెండాను రూపొందించారు. పార్టీ స్థాపనతో పాటు, కీలకమైన రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఆయన ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న బాధ్యతలు చేపట్టనున్నారు.
పార్టీ కార్యకలాపాలను ముందుకు నడిపించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజినీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్లను నియమించారు. అలాగే, పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నలుగురికి అవకాశం కల్పించారు. వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్లను ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తున్నట్టు మల్లన్న వెల్లడించారు. త్వరలోనే పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. మిగిలిన విభాగాలకు సంబంధించిన కార్యవర్గాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.