వెనెజులా స్మగ్లర్ల బోటును పేల్చేసిన అమెరికా నేవీ.. వీడియో ఇదిగో!
- ముగ్గురు స్మగ్లర్లనూ మట్టుబెట్టామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- అమెరికన్లను విషపూరితం చేస్తున్నారని ఆగ్రహం
- నార్కోటెర్రరిస్టుల పట్ల కఠినంగా ఉంటామని వెల్లడి
అంతర్జాతీయ జలాల్లో కనిపించిన ఈ బోటు స్మగ్లర్లదేనని నిర్ధారించుకున్న తర్వాతే తమ నేవీ దాడి చేసిందని ట్రంప్ వివరించారు. అందులో పెద్ద మొత్తంలో మత్తుమందులను అమెరికాలోకి తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ బోటును పేల్చేయడంతో అందులో ఉన్న ముగ్గురు వెనెజులా స్మగ్లర్లు చనిపోయారని ఆయన వివరించారు. కాగా, వారం రోజుల క్రితం ఇదేవిధంగా ఓ స్పీడ్ బోటును సముద్రంలోనే పేల్చేశామని, ఆ ఘటనలో పదకొండు మంది స్మగ్లర్లు చనిపోయారని ట్రంప్ తెలిపారు.