Venkata Ranga Reddy: హైదరాబాద్లో యోగా గురువుకు హనీట్రాప్.. మహిళలతో వల వేసి రూ. 2 కోట్లకు బ్లాక్మెయిల్!
- యోగా గురువును టార్గెట్ చేసిన హనీట్రాప్ ముఠా
- అనారోగ్యం పేరుతో ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు
- గురువుతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు, వీడియోల చిత్రీకరణ
- వాటితో రూ. 2 కోట్లకు బ్లాక్ మెయిల్.. రూ. 50 లక్షల వసూలు
- బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు.. ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్ శివార్లలోని ఒక ప్రముఖ యోగా గురువును లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా పక్కా ప్రణాళికతో హనీట్రాప్ చేసింది. అనారోగ్యం పేరుతో ఇద్దరు మహిళలను ఆశ్రమానికి పంపి, ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయిన మిట్ట వెంకటరంగారెడ్డి రెండేళ్లుగా దామరగిద్ద గ్రామంలో ‘సీక్రెట్ ఆఫ్ నేచర్స్’ అనే యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ యోగా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై శిక్షణ ఇస్తుంటారు. హైదరాబాద్కు చెందిన అమర్ అనే వ్యక్తి వెంకటరంగారెడ్డి నుంచి డబ్బు గుంజాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ మంజుల, రజని అనే ఇద్దరు మహిళలను ఆయన ఆశ్రమంలో చేర్పించాడు.
పథకం ప్రకారం ఈ మహిళలిద్దరూ యోగా గురువుకు దగ్గరయ్యారు. ఆయనతో సన్నిహితంగా మెలుగుతూ రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి వాటిని అమర్కు పంపించారు. ఆ ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని అమర్ ముఠా వెంకటరంగారెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని బయటపెట్టి పరువు తీస్తామని, ఆశ్రమం పేరు చెడగొడతామని బెదిరించారు. దీంతో భయపడిన ఆయన వారికి రూ. 50 లక్షల విలువైన చెక్కులు ఇచ్చారు.
అంతటితో ఆగని నిందితులు రూ. 2 కోట్లు ఇవ్వాలని మళ్లీ బెదిరింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. డబ్బు ఇస్తానని నమ్మించి ముఠా సభ్యులను హైదరాబాద్ శివార్లలోని తారామతి బారాదరికి పిలిపించారు. అక్కడ వెంకటరంగారెడ్డిని బెదిరిస్తుండగా అప్పటికే మాటువేసిన పోలీసులు అమర్, మంజుల, రజని, మౌలాలి, రాజేశ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ముఠా గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయిన మిట్ట వెంకటరంగారెడ్డి రెండేళ్లుగా దామరగిద్ద గ్రామంలో ‘సీక్రెట్ ఆఫ్ నేచర్స్’ అనే యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ యోగా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై శిక్షణ ఇస్తుంటారు. హైదరాబాద్కు చెందిన అమర్ అనే వ్యక్తి వెంకటరంగారెడ్డి నుంచి డబ్బు గుంజాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ మంజుల, రజని అనే ఇద్దరు మహిళలను ఆయన ఆశ్రమంలో చేర్పించాడు.
పథకం ప్రకారం ఈ మహిళలిద్దరూ యోగా గురువుకు దగ్గరయ్యారు. ఆయనతో సన్నిహితంగా మెలుగుతూ రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి వాటిని అమర్కు పంపించారు. ఆ ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని అమర్ ముఠా వెంకటరంగారెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని బయటపెట్టి పరువు తీస్తామని, ఆశ్రమం పేరు చెడగొడతామని బెదిరించారు. దీంతో భయపడిన ఆయన వారికి రూ. 50 లక్షల విలువైన చెక్కులు ఇచ్చారు.
అంతటితో ఆగని నిందితులు రూ. 2 కోట్లు ఇవ్వాలని మళ్లీ బెదిరింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. డబ్బు ఇస్తానని నమ్మించి ముఠా సభ్యులను హైదరాబాద్ శివార్లలోని తారామతి బారాదరికి పిలిపించారు. అక్కడ వెంకటరంగారెడ్డిని బెదిరిస్తుండగా అప్పటికే మాటువేసిన పోలీసులు అమర్, మంజుల, రజని, మౌలాలి, రాజేశ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ముఠా గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.