Aishani Dwivedi: పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్: పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి భార్య తీవ్ర స్పందన
- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను దేశ ప్రజలందరూ బహిష్కరించాలని పిలుపు
- ఎవరూ స్టేడియానికి వెళ్లి చూడవద్దని, టీవీలు కూడా ఆన్ చేయవద్దన్న ఐశాన్య
- బీసీసీఐని, క్రికెటర్లను తప్పుబట్టిన ఐశాన్య
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల కుటుంబాల వేదనను విస్మరించి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం సముచితం కాదని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను దేశ ప్రజలందరూ బహిష్కరించాలని పహల్గామ్ దాడిలో మరణించిన శుభమ్ ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది పిలుపునిచ్చారు.
ఈ విషయంపై ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఈ మ్యాచ్ను బహిష్కరించండి. ఎవరూ స్టేడియానికి వెళ్ళి చూడవద్దు, కనీసం ఇళ్లలో టీవీలు కూడా ఆన్ చేయవద్దు" అని ఆమె ప్రజలను కోరారు. బీసీసీఐ వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. "భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు బీసీసీఐ ఎలా అంగీకరిస్తుంది? ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల, 'ఆపరేషన్ సిందూర్' అమరవీరుల పట్ల బీసీసీఐకి ఏమాత్రం సానుభూతి లేనట్లుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
భారత క్రికెటర్ల వైఖరిని కూడా ఆమె తప్పుబట్టారు. "మన క్రికెటర్లు ఏం చేస్తున్నారు? వారిని దేశభక్తులు అంటారు కదా. ఒకరిద్దరు తప్ప ఎవరూ పాకిస్థాన్తో మ్యాచ్ ఆడొద్దని ముందుకు రావడం లేదు. తుపాకీ గురిపెట్టి బీసీసీఐ వారిని ఆడించలేదు కదా? దేశం కోసం వారు గట్టిగా నిలబడాలి. కానీ అలా చేయడం లేదు" అని విమర్శించారు.
ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం మళ్లీ ఉగ్రవాదానికే వెళుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ మ్యాచ్ స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లను నేను అడగాలనుకుంటున్నాను. ఆ 26 కుటుంబాల విషయంలో మీ దేశభక్తి ఏమైంది? మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయంతో పాకిస్థాన్ ఏం చేస్తుంది? ఆ డబ్బును ఉగ్రవాదం కోసమే వాడుతుంది. అది ఒక ఉగ్రవాద దేశం. మనం వారికి ఆదాయం అందించి, మళ్లీ మనపైనే దాడి చేయడానికి మనమే వారిని సిద్ధం చేసినట్లు అవుతుంది" అని ఐశాన్య అన్నారు.
ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈ వేదికగా సెప్టెంబర్ 14, ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. బహుళ దేశాల టోర్నమెంట్లలో పాక్తో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఈ మ్యాచ్ను బహిష్కరించండి. ఎవరూ స్టేడియానికి వెళ్ళి చూడవద్దు, కనీసం ఇళ్లలో టీవీలు కూడా ఆన్ చేయవద్దు" అని ఆమె ప్రజలను కోరారు. బీసీసీఐ వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. "భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు బీసీసీఐ ఎలా అంగీకరిస్తుంది? ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల, 'ఆపరేషన్ సిందూర్' అమరవీరుల పట్ల బీసీసీఐకి ఏమాత్రం సానుభూతి లేనట్లుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
భారత క్రికెటర్ల వైఖరిని కూడా ఆమె తప్పుబట్టారు. "మన క్రికెటర్లు ఏం చేస్తున్నారు? వారిని దేశభక్తులు అంటారు కదా. ఒకరిద్దరు తప్ప ఎవరూ పాకిస్థాన్తో మ్యాచ్ ఆడొద్దని ముందుకు రావడం లేదు. తుపాకీ గురిపెట్టి బీసీసీఐ వారిని ఆడించలేదు కదా? దేశం కోసం వారు గట్టిగా నిలబడాలి. కానీ అలా చేయడం లేదు" అని విమర్శించారు.
ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం మళ్లీ ఉగ్రవాదానికే వెళుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ మ్యాచ్ స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లను నేను అడగాలనుకుంటున్నాను. ఆ 26 కుటుంబాల విషయంలో మీ దేశభక్తి ఏమైంది? మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయంతో పాకిస్థాన్ ఏం చేస్తుంది? ఆ డబ్బును ఉగ్రవాదం కోసమే వాడుతుంది. అది ఒక ఉగ్రవాద దేశం. మనం వారికి ఆదాయం అందించి, మళ్లీ మనపైనే దాడి చేయడానికి మనమే వారిని సిద్ధం చేసినట్లు అవుతుంది" అని ఐశాన్య అన్నారు.
ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈ వేదికగా సెప్టెంబర్ 14, ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. బహుళ దేశాల టోర్నమెంట్లలో పాక్తో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.