రేణు అగర్వాల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఝార్ఖండ్లో నిందితుల అరెస్ట్
- కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పురోగతి
- ఝార్ఖండ్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- హైదరాబాద్కు తరలించేందుకు పోలీసుల ఏర్పాట్లు
- నమ్మకంగా చేరిన వంట మనిషే ప్రధాన నిందితుడు
- డబ్బు, బంగారం కోసమే దారుణానికి పాల్పడిన వైనం
బుధవారం ఉదయం రాకేశ్, ఆయన కుమారుడు శుభం షాపునకు వెళ్లిన తర్వాత ఇంట్లో రేణు ఒంటరిగా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన హర్ను, రోషన్ కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డారు. డబ్బు, బంగారం ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి, ప్రెషర్ కుక్కర్తో తలపై బలంగా మోది కిరాతకంగా హత్య చేశారు.
అనంతరం ఇంట్లోని లాకర్లు పగులగొట్టి నగదు, నగలు దోచుకుని ఒక సూట్కేసులో సర్దుకున్నారు. హత్య తర్వాత స్నానం చేసి, రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి వేరే బట్టలు వేసుకున్నారు. ఇంటికి తాళం వేసి, అగర్వాల్ కుటుంబానికి చెందిన స్కూటీపైనే పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో వారు సూట్కేసుతో వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
సాయంత్రం భర్త, కుమారుడు ఇంటికి వచ్చి చూడగా రేణు రక్తపు మడుగులో పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితులు ఝార్ఖండ్లో ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే నిందితులను నగరానికి తీసుకొచ్చి విచారించనున్నారు.