Bangalore Tenant: ఉండేది ఇద్దరే.. వాటర్ బిల్లు రూ.16 వేలా?.. బెంగళూరు ఓనర్ మోసంపై రెడిట్లో పోస్ట్!
- బెంగళూరులో అద్దెదారుకు భారీ వాటర్ బిల్లు షాక్
- సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్న బాధితుడు
- యజమానిని అడిగితే పిచ్చి సమాధానాలు ఇస్తున్నాడని ఆవేదన
- మీటర్లో సమస్య లేదా కమర్షియల్ వాడకం అని నెటిజన్ల అనుమానం
- యజమానిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్ల సూచన
టెక్ హబ్ బెంగళూరులో ఇంటి అద్దెలు, డిపాజిట్లే కాదు.. నీటి బిల్లులు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇద్దరు మాత్రమే నివసించే ఇంటికి ఏకంగా నెలకు రూ.15,800 వాటర్ బిల్లు రావడంతో ఓ అద్దెదారు అవాక్కయ్యాడు. తన యజమాని ప్రతి నెలా ఇలాగే అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తూ మోసం చేస్తున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని "ప్రతి నెలా నా యజమాని అధిక వాటర్ చార్జీలతో నన్ను వేధిస్తున్నాడు" అనే శీర్షికతో రెడిట్లో పోస్ట్ చేశాడు. 1,65,000 లీటర్ల నీటిని వాడినందుకు గాను సుమారు రూ.15,800 బిల్లు వచ్చిన కాపీని కూడా అతను షేర్ చేశాడు. "మేమిద్దరమే ఇంట్లో ఉంటాం, అదీ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతాం. అయినా ప్రతి నెలా దాదాపు రూ.10,000 వాటర్ బిల్లు వస్తోంది. దీనిపై యజమానిని ప్రశ్నిస్తే ఏవో పిచ్చి కారణాలు చెబుతున్నాడు. పైగా, పదిహేను రోజులకోసారి ఒకటి, రెండు రోజులు నీళ్లు కూడా రావు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదు" అని అతను వాపోయాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఇద్దరు వ్యక్తులకు ఇంత భారీ బిల్లు రావడం అసాధ్యమని, కచ్చితంగా ఇందులో ఏదో మోసం జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. "ఇద్దరు వ్యక్తులకు గరిష్ఠంగా రూ. 300 మించి బిల్లు రాకూడదు. మీటర్లో గాలి ప్రవహించడం వల్ల రీడింగ్ పెరిగి ఉండవచ్చు లేదా మీటర్ రీడింగ్ తీసే వ్యక్తితో యజమాని కుమ్మక్కై ఉండవచ్చు" అని ఒకరు కామెంట్ చేశారు. యజమాని ఆ నీటిని వాణిజ్య అవసరాలకు వాడుతూ ఉండవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు.
"మా కుటుంబంలో నలుగురు సభ్యులం, పెద్ద గార్డెన్ ఉన్నా నెలకు 15 నుంచి 20 వేల లీటర్ల నీటిని మాత్రమే వాడతాం" అని మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. పక్కింటి వారిని సంప్రదించి వారి బిల్లులు ఎంత వస్తున్నాయో తెలుసుకోవాలని, అవసరమైతే న్యాయవాదిని సంప్రదించి యజమానిపై కేసు పెట్టాలని పలువురు బాధితుడికి సలహాలు ఇస్తున్నారు.
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని "ప్రతి నెలా నా యజమాని అధిక వాటర్ చార్జీలతో నన్ను వేధిస్తున్నాడు" అనే శీర్షికతో రెడిట్లో పోస్ట్ చేశాడు. 1,65,000 లీటర్ల నీటిని వాడినందుకు గాను సుమారు రూ.15,800 బిల్లు వచ్చిన కాపీని కూడా అతను షేర్ చేశాడు. "మేమిద్దరమే ఇంట్లో ఉంటాం, అదీ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతాం. అయినా ప్రతి నెలా దాదాపు రూ.10,000 వాటర్ బిల్లు వస్తోంది. దీనిపై యజమానిని ప్రశ్నిస్తే ఏవో పిచ్చి కారణాలు చెబుతున్నాడు. పైగా, పదిహేను రోజులకోసారి ఒకటి, రెండు రోజులు నీళ్లు కూడా రావు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావడం లేదు" అని అతను వాపోయాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఇద్దరు వ్యక్తులకు ఇంత భారీ బిల్లు రావడం అసాధ్యమని, కచ్చితంగా ఇందులో ఏదో మోసం జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. "ఇద్దరు వ్యక్తులకు గరిష్ఠంగా రూ. 300 మించి బిల్లు రాకూడదు. మీటర్లో గాలి ప్రవహించడం వల్ల రీడింగ్ పెరిగి ఉండవచ్చు లేదా మీటర్ రీడింగ్ తీసే వ్యక్తితో యజమాని కుమ్మక్కై ఉండవచ్చు" అని ఒకరు కామెంట్ చేశారు. యజమాని ఆ నీటిని వాణిజ్య అవసరాలకు వాడుతూ ఉండవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు.
"మా కుటుంబంలో నలుగురు సభ్యులం, పెద్ద గార్డెన్ ఉన్నా నెలకు 15 నుంచి 20 వేల లీటర్ల నీటిని మాత్రమే వాడతాం" అని మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. పక్కింటి వారిని సంప్రదించి వారి బిల్లులు ఎంత వస్తున్నాయో తెలుసుకోవాలని, అవసరమైతే న్యాయవాదిని సంప్రదించి యజమానిపై కేసు పెట్టాలని పలువురు బాధితుడికి సలహాలు ఇస్తున్నారు.