రేపు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం... ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు
- హస్తినకు పయనమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం
- ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా హాజరు
- కార్యక్రమం తర్వాత తిరిగి అమరావతికి పయనం
శుక్రవారం ఢిల్లీలో భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందిన ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.