ఉద్యమం మాటున అరాచకాలకు పాల్పడితే ఊరుకోబోం.. నేపాల్ ఆర్మీ హెచ్చరిక
––
‘ఆందోళనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. ఉద్యమం మాటున దోపిడీలకు, దాడులకు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నాయి. మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షిస్తాం. ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ మేరకు దేశాధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేశారు. ప్రభుత్వం కూలిపోయింది. దేశంలో శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉంది. సామాన్యుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలి. ఆందోళనలను విరమించి నిరసనకారులు చర్చలకు రావాలి’ అని జనరల్ అశోక్ రాజ్ పిలుపునిచ్చారు.