Kajal Aggarwal: అదంతా అబద్ధం, నేను క్షేమంగా ఉన్నా: కాజల్ అగర్వాల్
- నటి కాజల్ అగర్వాల్ మృతి అంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్
- ప్రమాదం జరిగిందంటూ నకిలీ వీడియోలతో దుష్ప్రచారం
- తాను క్షేమంగా ఉన్నానంటూ స్వయంగా స్పష్టతనిచ్చిన కాజల్
- ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి
- ఆందోళనకు గురైన అభిమానులు.. కాజల్ పోస్టుతో ఊపిరి పీల్చుకున్న వైనం
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్కు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపించిన ఓ తప్పుడు వార్త తీవ్ర కలకలం రేపింది. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వచ్చిన వదంతులు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించిన కాజల్, తాను సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నానని స్పష్టం చేస్తూ పుకార్లకు తెరదించారు.
సోమవారం కాజల్ రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయి. దీనికి బలం చేకూరుస్తూ కొందరు ఆకతాయిలు నకిలీ వీడియోలను కూడా ప్రచారంలోకి తెచ్చారు. దీంతో కొందరు ఇది నిజమని నమ్మి, సోషల్ మీడియాలో సంతాప సందేశాలు కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫేక్ న్యూస్ తన దృష్టికి రావడంతో కాజల్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.
“నాకు యాక్సిడెంట్ అయిందని, నేను ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. దేవుడి దయ వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. మనం సానుకూల దృక్పథంతో, నిజం వైపు ఉందాం” అని కాజల్ తన పోస్టులో పేర్కొన్నారు.
వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును 2020లో వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్, 2022లో నీల్ అనే బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తూ సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. కాజల్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం కాజల్ రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయి. దీనికి బలం చేకూరుస్తూ కొందరు ఆకతాయిలు నకిలీ వీడియోలను కూడా ప్రచారంలోకి తెచ్చారు. దీంతో కొందరు ఇది నిజమని నమ్మి, సోషల్ మీడియాలో సంతాప సందేశాలు కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఫేక్ న్యూస్ తన దృష్టికి రావడంతో కాజల్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.
“నాకు యాక్సిడెంట్ అయిందని, నేను ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. దేవుడి దయ వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. మనం సానుకూల దృక్పథంతో, నిజం వైపు ఉందాం” అని కాజల్ తన పోస్టులో పేర్కొన్నారు.
వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును 2020లో వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్, 2022లో నీల్ అనే బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తూ సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. కాజల్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు.