ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం లేదు: ఎందుకో చెప్పిన కేటీఆర్
- రైతుల పక్షాన తమ గళాన్ని వినిపిస్తామన్న కేటీఆర్
- అందుకే రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటన
- రైతుల సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయమని వెల్లడి
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండూ రైతాంగాన్ని వేధిస్తున్నాయని ఆరోపించారు. యూరియా సమస్యపై తాము 20 రోజుల ముందే హెచ్చరించినా, రెండు ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరఫున నిరసన తెలిపేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
"మేము ఎన్డీఏకు గానీ, ఇండియా కూటమికి గానీ జవాబుదారీ కాదు. కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ" అని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల బహిష్కరణను ఒక వేదికగా ఉపయోగించుకుని, తెలంగాణ రైతుల బాధలను దేశం దృష్టికి తీసుకెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. తమ పోరాటం కేవలం రైతుల సంక్షేమం కోసమేనని కేటీఆర్ తేల్చిచెప్పారు.