Nirmala Sitharaman: అమెరికా ఒత్తిడిని పట్టించుకోం.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తాం: తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman says India will continue to buy oil from Russia
షార్ట్స్‌లో చూడండి
రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లకు భారత్ తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం స్పష్టం చేశారు. కేవలం దేశ ప్రయోజనాలను, అవసరాలను దృష్టిలో ఉంచుకునే తమ నిర్ణయాలు ఉంటాయని ఆమె తేల్చిచెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని కుండబద్దలు కొట్టారు.

ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ, "విషయం రష్యా చమురు అయినా, మరేదైనా సరే మాకు ఏది అనుకూలంగా ఉంటే ఆ నిర్ణయమే తీసుకుంటాం. ముఖ్యంగా ధర, రవాణా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. విదేశీ మారక ద్రవ్యం భారీగా ముడిపడి ఉన్న చమురును ఎక్కడి నుంచి కొనాలనేది పూర్తిగా మా అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మేము నిస్సందేహంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తాం" అని ఆమె వివరించారు. దేశ దిగుమతుల బిల్లులో అత్యధిక వాటా ముడి చమురుదేనని ఆమె మరోసారి గుర్తుచేశారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 27 నుంచి భారత్‌పై మొత్తం 50 శాతం దిగుమతి సుంకాన్ని ఆయన విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
Go Back to Shorts
Nirmala Sitharaman
Russia oil
India Russia oil
India oil imports
US pressure India
Ukraine war

More Telugu News