Shyamala: వీళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు!: యాంకర్ శ్యామల

Anchor Shyamala Comments on AP Medical Colleges Privatization
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వైద్య విద్య భవిష్యత్తుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని విమర్శించారు.

గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని శ్యామల గుర్తుచేశారు. "దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వందేళ్ల క్రితం ఏర్పాటైన ఆంధ్ర మెడికల్ కాలేజీ తర్వాత దశాబ్దాలుగా ఎవరూ కొత్త కాలేజీల గురించి ఆలోచించలేదు" అని ఆమె పేర్కొన్నారు.

రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టిపీడించినా, దానిని ఎదుర్కొంటూనే జగన్ సర్కార్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించిందని, ఇది దేశ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు అని శ్యామల అభివర్ణించారు. ఇంత గొప్పగా నిర్మించిన విద్యాసంస్థలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని చూడటం దారుణమని ఆమె అన్నారు. "ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారు... వీళ్లని ఏమనాలో అర్థం కావడం లేదు. రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళుతున్నారు?" అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
Go Back to Shorts
Shyamala
Anchor Shyamala
Andhra Pradesh
Medical Colleges
Jagan Government
Private Medical Colleges
YSRCP
Andhra Medical College
AP Politics
Government Assets

More Telugu News