IPL: ఐపీఎల్ టికెట్లపై జీఎస్టీ భారం.. ఇక మ్యాచ్ చూడాలంటే జేబు గుల్లే
- జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు
- రెండు శ్లాబులకు పరిమితం కానున్న పన్ను విధానం
- కొత్తగా 40 శాతం ప్రత్యేక పన్ను శ్లాబ్
- ఐపీఎల్ వంటి ప్రీమియం ఈవెంట్లపై 40 శాతం జీఎస్టీ
- భారీగా పెరగనున్న మ్యాచ్ టికెట్ల ధరలు
ఐపీఎల్ మ్యాచ్లను స్టేడియంలో చూసి ఆస్వాదించే క్రికెట్ అభిమానులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై ఐపీఎల్ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. జీఎస్టీ పన్ను విధానంలో చేసిన కీలక మార్పుల కారణంగా ఈ భారం ప్రేక్షకుడిపై పడనుంది. ఐపీఎల్ వంటి ప్రీమియం క్రీడా ఈవెంట్లపై ఏకంగా 40 శాతం పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించడమే ఇందుకు కారణం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల విధానంలో పలు మార్పులకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతం అనే నాలుగు శ్లాబుల స్థానంలో కేవలం 5, 18 శాతం శ్లాబులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు. అయితే, ఇదే సమయంలో విలాసవంతమైన వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, ఖరీదైన కార్లతో పాటు గుర్రపు పందేలు, క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ వంటి వాటి కోసం కొత్తగా 40 శాతం ప్రత్యేక పన్ను శ్లాబును ప్రవేశపెట్టారు.
ఈ కొత్త శ్లాబ్ పరిధిలోకి ఐపీఎల్ను కూడా 'ప్రీమియం లీగ్'గా పరిగణించి చేర్చారు. ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, తాజా నిర్ణయంతో అది 40 శాతానికి పెరగనుంది. ఉదాహరణకు, రూ. 1000 విలువైన టికెట్కు పాత పన్ను విధానంలో రూ. 1280 చెల్లించాల్సి ఉండగా, కొత్త విధానం ప్రకారం రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రతి టికెట్పై అదనంగా రూ. 120 భారం పడుతుంది.
అయితే, జాతీయ, అంతర్జాతీయ సమాఖ్యల గుర్తింపు పొందిన క్రీడా ఈవెంట్లకు ఈ 40 శాతం పన్ను వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీమిండియా ఆడే మ్యాచ్లు, అంతర్జాతీయ హాకీ వంటి ఈవెంట్లు దీని పరిధిలోకి రావు. రూ. 500 లోపు టికెట్లపై పూర్తి మినహాయింపు ఉండగా, రూ. 500 దాటిన టికెట్లపై పాత పద్ధతిలోనే 18 శాతం పన్ను వర్తిస్తుంది. దీంతో జాతీయ జట్ల మ్యాచ్లను వీక్షించే అభిమానులకు ఊరట లభించినప్పటికీ, ఐపీఎల్ అభిమానులపై మాత్రం పన్ను భారం తప్పేలా లేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల విధానంలో పలు మార్పులకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతం అనే నాలుగు శ్లాబుల స్థానంలో కేవలం 5, 18 శాతం శ్లాబులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు. అయితే, ఇదే సమయంలో విలాసవంతమైన వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, ఖరీదైన కార్లతో పాటు గుర్రపు పందేలు, క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ వంటి వాటి కోసం కొత్తగా 40 శాతం ప్రత్యేక పన్ను శ్లాబును ప్రవేశపెట్టారు.
ఈ కొత్త శ్లాబ్ పరిధిలోకి ఐపీఎల్ను కూడా 'ప్రీమియం లీగ్'గా పరిగణించి చేర్చారు. ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, తాజా నిర్ణయంతో అది 40 శాతానికి పెరగనుంది. ఉదాహరణకు, రూ. 1000 విలువైన టికెట్కు పాత పన్ను విధానంలో రూ. 1280 చెల్లించాల్సి ఉండగా, కొత్త విధానం ప్రకారం రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రతి టికెట్పై అదనంగా రూ. 120 భారం పడుతుంది.
అయితే, జాతీయ, అంతర్జాతీయ సమాఖ్యల గుర్తింపు పొందిన క్రీడా ఈవెంట్లకు ఈ 40 శాతం పన్ను వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీమిండియా ఆడే మ్యాచ్లు, అంతర్జాతీయ హాకీ వంటి ఈవెంట్లు దీని పరిధిలోకి రావు. రూ. 500 లోపు టికెట్లపై పూర్తి మినహాయింపు ఉండగా, రూ. 500 దాటిన టికెట్లపై పాత పద్ధతిలోనే 18 శాతం పన్ను వర్తిస్తుంది. దీంతో జాతీయ జట్ల మ్యాచ్లను వీక్షించే అభిమానులకు ఊరట లభించినప్పటికీ, ఐపీఎల్ అభిమానులపై మాత్రం పన్ను భారం తప్పేలా లేదు.