Revanth Reddy: మీ గొడవల్లోకి నన్ను లాగొద్దు: కవిత ఆరోపణలపై రేవంత్ స్పందన
- హరీశ్ వెనుక రేవంత్ ఉన్నారన్న కవిత
- ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక తాను ఎందుకుంటానన్న రేవంత్
- బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ అని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు ముదిరి ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకునే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఒక కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, అవినీతి సొమ్ము పంపకాల విషయంలోనే ఆ పార్టీలో కుమ్ములాటలు జరుగుతున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. తనపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో బదులిచ్చారు.
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. హరీశ్ రావు, సంతోష్ రావుల వెనుక తాను ఉన్నానంటూ కవిత చేసిన ఆరోపణలను సీఎం ప్రస్తావించారు. "ప్రజలు తిరస్కరించిన వారి వెనుక నేను ఎందుకు ఉంటాను? నాకంత సమయం లేదు. మీ కుటుంబ గొడవల్లోకి మమ్మల్ని లాగకండి" అని ఆయన స్పష్టం చేశారు. తాను నాయకుడినని, తాను ముందు ఉంటానే కానీ వెనుక ఉండనని అన్నారు.
"గతంలో ఎంతోమందిని రాజకీయంగా అణచివేసి, అక్రమంగా జైళ్లకు పంపినవాళ్లే ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని కొట్టుకుంటున్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదు, కచ్చితంగా అనుభవించి తీరుతారు" అని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడంలో తలెత్తిన విభేదాలే వారి మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయని ఆరోపించారు.
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. హరీశ్ రావు, సంతోష్ రావుల వెనుక తాను ఉన్నానంటూ కవిత చేసిన ఆరోపణలను సీఎం ప్రస్తావించారు. "ప్రజలు తిరస్కరించిన వారి వెనుక నేను ఎందుకు ఉంటాను? నాకంత సమయం లేదు. మీ కుటుంబ గొడవల్లోకి మమ్మల్ని లాగకండి" అని ఆయన స్పష్టం చేశారు. తాను నాయకుడినని, తాను ముందు ఉంటానే కానీ వెనుక ఉండనని అన్నారు.
"గతంలో ఎంతోమందిని రాజకీయంగా అణచివేసి, అక్రమంగా జైళ్లకు పంపినవాళ్లే ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని కొట్టుకుంటున్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదు, కచ్చితంగా అనుభవించి తీరుతారు" అని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడంలో తలెత్తిన విభేదాలే వారి మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయని ఆరోపించారు.