glass bridge: పర్యాటకుల కోసం సిద్ధమైన విశాఖ గాజు వంతెన.. వీడియో ఇదిగో!
––
విశాఖపట్నంలోని కైలాసగిరిపై నగరపాలక సంస్థ చేపట్టిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది. విశాఖవాసులతో పాటు నగరానికి వచ్చే పర్యాటకులకు ఈ వంతెన థ్రిల్ పంచనుంది. కైలాసగిరిపై 55 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలోనే అతి పొడవైనది.
చుట్టూ కొండలు, కింద లోయ, ఎదురుగా సముద్రం.. ఇలా వంతెన పైనుంచి వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఈ వంతెనపై ఒకేసారి వంద మంది నిలబడవచ్చు. అయితే, ప్రస్తుతం ఒకసారికి 40 మందిని మాత్రమే వంతెనపైకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
చుట్టూ కొండలు, కింద లోయ, ఎదురుగా సముద్రం.. ఇలా వంతెన పైనుంచి వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఈ వంతెనపై ఒకేసారి వంద మంది నిలబడవచ్చు. అయితే, ప్రస్తుతం ఒకసారికి 40 మందిని మాత్రమే వంతెనపైకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.