Parvati Melton: పెళ్లైన 13 ఏళ్లకు తల్లి కాబోతున్న పార్వతి మెల్టన్... బేబీ బంప్ ఫొటోలు వైరల్
- తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించిన పార్వతి మెల్టన్
- శుభాకాంక్షలు తెలియజేస్తున్న అభిమానులు
- 2012లో అమెరికాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లాడిన పార్వతి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం 'జల్సా'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పార్వతి మెల్టన్, అభిమానులకు ఒక తీపి కబురు అందించింది. తాను త్వరలో తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన బేబీ బంప్తో దిగిన ఫొటోలను షేర్ చేయగా, అవి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న పార్వతి మెల్టన్... సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోషూట్పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెకు అభినందనలు తెలుపుతుండగా, మరికొందరు బేబీ బంప్తో ఇంత హాట్గా ఫొటోషూట్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
'వెన్నెల' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన పార్వతి, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా 'జల్సా' సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'దూకుడు' సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే, 2012లో అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. అప్పటి నుంచి సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబం, వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది. పెళ్లైన 13 సంవత్సరాలకు ఆమె తల్లి కాబోతుండటం గమనార్హం.
ఇదిలా ఉండగా, తన కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడానికి ఇద్దరు దర్శకులే కారణమని పార్వతి గతంలో ఆరోపించడం గమనార్హం. అయితే వారి పేర్లను ఆమె బయటపెట్టలేదు. ఆ దర్శకులు ఎవరో ఇండస్ట్రీ వర్గాలకు తెలుసంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.
కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న పార్వతి మెల్టన్... సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోషూట్పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెకు అభినందనలు తెలుపుతుండగా, మరికొందరు బేబీ బంప్తో ఇంత హాట్గా ఫొటోషూట్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
'వెన్నెల' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన పార్వతి, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా 'జల్సా' సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'దూకుడు' సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే, 2012లో అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడింది. అప్పటి నుంచి సినిమాలకు పూర్తిగా దూరమై తన కుటుంబం, వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది. పెళ్లైన 13 సంవత్సరాలకు ఆమె తల్లి కాబోతుండటం గమనార్హం.
ఇదిలా ఉండగా, తన కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడానికి ఇద్దరు దర్శకులే కారణమని పార్వతి గతంలో ఆరోపించడం గమనార్హం. అయితే వారి పేర్లను ఆమె బయటపెట్టలేదు. ఆ దర్శకులు ఎవరో ఇండస్ట్రీ వర్గాలకు తెలుసంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.