Perni Nani: దాన్ని కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు: పేర్ని నాని

Perni Nani Criticizes Pawan Kalyan Over Sugali Preethi Case
షార్ట్స్‌లో చూడండి
సుగాలి ప్రీతి కేసు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తీరు వల్ల సుగాలి ప్రీతి కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతోందని, వారికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తమ అధినేత వైఎస్ జగన్ ఆ కుటుంబానికి చేసిన మేలును పవన్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ ప్రభుత్వం భూమి, ఇల్లు కేటాయించడంతో పాటు ఉద్యోగ అవకాశం కూడా కల్పించిందని పేర్ని నాని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆ క్రెడిట్‌ను తానే తీసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే ఈ కేసులోని నిందితులకు బెయిల్ వచ్చిందని, కానీ చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేకనే పవన్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ పవన్ కల్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నాని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ వేధింపుల కారణంగా ఇప్పటికే 1,440 మంది ఉద్యోగులు వెళ్లిపోయారని, మరో 2,000 మందిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సుమారు 1,000 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలపై కూడా పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన పార్టీది లెఫ్టిజమా, రైటిజమా లేక సెంట్రలిజమా అనే విషయం ఆ పార్టీ నేతలకే స్పష్టత లేదని ఆయన విమర్శించారు. టీడీపీని అంతర్జాతీయ పార్టీగా, జనసేనను జాతీయ పార్టీగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు
Go Back to Shorts
Perni Nani
Sugali Preethi case
Pawan Kalyan
YS Jagan
Visakha Steel Plant
TDP
YSRCP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Janasena

More Telugu News