రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం దృష్టి
- భవనాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు
- అధ్యయనం చేసేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు
- సరైన విధంగా వినియోగించే మార్గాలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని సూచన
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనాలను సముచితంగా వినియోగించే మార్గాలను అన్వేషించి, తగిన సిఫార్సులు ప్రభుత్వానికి అందజేయాలని కమిటీకి సూచించారు.