Amaravati: అమరావతి మీదుగా బుల్లెట్ రైలు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక కారిడార్లకు ఆమోదం!
- ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం
- హైదరాబాద్-చెన్నై మార్గం రాజధాని అమరావతి మీదుగా నిర్మాణం
- రాయలసీమ జిల్లాల గుండా హైదరాబాద్-బెంగళూరు మరో కారిడార్
- సీమ కారిడార్లో కర్నూలు, అనంతపురం సహా 6 స్టేషన్లు
- ప్రధాన నగరాల మధ్య భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల మీదుగా రెండు హై-స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్, రాయలసీమ జిల్లాల గుండా హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్ర రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు.
రాజధానిని తాకనున్న హైదరాబాద్-చెన్నై మార్గం
హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి (సీఆర్డీఏ) మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్డీఏ గుండా వెళ్తుంది.
రాయలసీమ మీదుగా బెంగళూరుకు బుల్లెట్ ప్రయాణం
మరోవైపు, రాయలసీమ వాసులకు ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్-బెంగళూరు కారిడార్ను రూపొందించారు. 576.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతరంగా సాగుతుంది. ఈ మార్గంలో ఏపీ పరిధిలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపురం స్టేషన్లతో పాటు, కియా పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని శ్రీ సత్యసాయి జిల్లా దుద్దేబండ వద్ద మరో స్టేషన్ను ప్రతిపాదించారు. ఈ కారిడార్లో ఏపీలో 263.3 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది.
ఈ రెండు కారిడార్లు పూర్తికావడంతో పాటు, ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు-చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే... హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు చతుర్భుజి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ మహానగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం ఒకటి రెండు గంటలకు తగ్గిపోనుంది. ఇది వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
రాజధానిని తాకనున్న హైదరాబాద్-చెన్నై మార్గం
హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి (సీఆర్డీఏ) మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్డీఏ గుండా వెళ్తుంది.
రాయలసీమ మీదుగా బెంగళూరుకు బుల్లెట్ ప్రయాణం
మరోవైపు, రాయలసీమ వాసులకు ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్-బెంగళూరు కారిడార్ను రూపొందించారు. 576.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతరంగా సాగుతుంది. ఈ మార్గంలో ఏపీ పరిధిలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపురం స్టేషన్లతో పాటు, కియా పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని శ్రీ సత్యసాయి జిల్లా దుద్దేబండ వద్ద మరో స్టేషన్ను ప్రతిపాదించారు. ఈ కారిడార్లో ఏపీలో 263.3 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది.
ఈ రెండు కారిడార్లు పూర్తికావడంతో పాటు, ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు-చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే... హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు చతుర్భుజి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ మహానగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం ఒకటి రెండు గంటలకు తగ్గిపోనుంది. ఇది వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.