Uddhav Thackeray: మళ్లీ కలిసిన ఠాక్రే సోదరులు... కుటుంబంతో కలిసి రాజ్ ఠాక్రే నివాసానికి వెళ్లిన ఉద్ధవ్ ఠాక్రే
- వినాయక చవితి పూజలో పాల్గొన్న ఠాక్రే సోదరులు
- ఇటీవల ఒకే వేదికపైకి వచ్చిన అన్నదమ్ములు
- స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటన
- ఠాక్రే సోదరుల కలయికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి
- 2005 తర్వాత విడిపోయిన ఉద్ధవ్, రాజ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా దూరంగా ఉన్న ఠాక్రే సోదరులు మళ్లీ ఒక్కటయ్యారు. వినాయక చవితి పండుగ వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది. వినాయక చవితి వేడుకల సందర్భంగా శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు.
ముంబైలోని రాజ్ ఠాక్రే ఇంట్లో ఏర్పాటు చేసిన గణపతి పూజలో ఉద్ధవ్ తన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు ఆప్యాయంగా పలకరించుకున్నాయి. ఈ పరిణామం ఠాక్రే సోదరుల మధ్య సయోధ్య మరింత బలపడిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
బాల్ ఠాక్రే మరణానంతరం 2005లో విడిపోయిన ఈ సోదరులు ఇటీవలి కాలంలో మళ్లీ దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. గత నెలలో మరాఠా భాషా ఉద్యమ విజయోత్సవ సభలో ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం రాజ్ ఠాక్రే... ఉద్ధవ్ నివాసమైన 'మాతోశ్రీ'కి కూడా వెళ్లారు. స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇరువురు నేతలు ప్రకటించడం వారి మధ్య సయోధ్యకు నిదర్శనంగా నిలిచింది.
తాజాగా వినాయక చవితి వేడుకల కోసం ఉద్ధవ్ కుటుంబసమేతంగా రాజ్ ఇంటికి వెళ్లడంతో, వీరి మధ్య బంధం మరింత బలపడిందని, ఇది భవిష్యత్తులో మహారాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముంబైలోని రాజ్ ఠాక్రే ఇంట్లో ఏర్పాటు చేసిన గణపతి పూజలో ఉద్ధవ్ తన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు ఆప్యాయంగా పలకరించుకున్నాయి. ఈ పరిణామం ఠాక్రే సోదరుల మధ్య సయోధ్య మరింత బలపడిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
బాల్ ఠాక్రే మరణానంతరం 2005లో విడిపోయిన ఈ సోదరులు ఇటీవలి కాలంలో మళ్లీ దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. గత నెలలో మరాఠా భాషా ఉద్యమ విజయోత్సవ సభలో ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం రాజ్ ఠాక్రే... ఉద్ధవ్ నివాసమైన 'మాతోశ్రీ'కి కూడా వెళ్లారు. స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇరువురు నేతలు ప్రకటించడం వారి మధ్య సయోధ్యకు నిదర్శనంగా నిలిచింది.
తాజాగా వినాయక చవితి వేడుకల కోసం ఉద్ధవ్ కుటుంబసమేతంగా రాజ్ ఇంటికి వెళ్లడంతో, వీరి మధ్య బంధం మరింత బలపడిందని, ఇది భవిష్యత్తులో మహారాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.