CIBIL Score: మీ సిబిల్ స్కోర్ తప్పుగా ఉందా? 2024-25లో సిబిల్కు 22 లక్షలకు పైగా ఫిర్యాదులు
- పారదర్శకత లేదంటూ లోక్సభలో ఎంపీ కార్తి చిదంబరం ఆందోళన
- సిబిల్ స్కోర్ చెక్ చేస్తే స్పామ్ కాల్స్తో వేధింపులంటూ ఆరోపణలు
- సిబిల్ స్కోర్ లేదని కొత్త రుణాలను తిరస్కరించవద్దని బ్యాంకులకు కేంద్రం సూచన
రుణాలు, ఉద్యోగాల విషయంలో సిబిల్ స్కోర్ అత్యంత కీలకం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సిబిల్కు ఏకంగా 22,94,855 ఫిర్యాదులు అందగా, వాటిలో 5,80,259 ఫిర్యాదులు సంస్థాగత తప్పిదాల వల్ల సంభవించాయని తేలడం గమనార్హం. ఈ విషయాన్ని సిబిల్ సంస్థే స్వయంగా ఒక రెగ్యులేటరీ ప్రకటనలో వెల్లడించింది.
వ్యక్తులు, సంస్థల రుణ చరిత్రను నమోదు చేసే సిబిల్ ఇచ్చే స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలు, క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ నియామకాల్లో సైతం ఇది కీలకం పాత్ర పోషిస్తోంది. ఇటీవల మద్రాస్ హైకోర్టు, ఎస్బీఐలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి నియామకాన్ని ప్రతికూల క్రెడిట్ రిపోర్టు కారణంగా రద్దు చేయడాన్ని సమర్థించింది. ఆర్థిక నిర్వహణ సక్రమంగా లేని వ్యక్తి ఇతరుల డబ్బును బాధ్యతగా చూసుకోలేరని కోర్టు వ్యాఖ్యానించింది.
సిబిల్ పనితీరులో పారదర్శకత లోపించిందని, నివేదికల్లోని తప్పులను సరిదిద్దుకోవడానికి వినియోగదారులకు సరైన అవకాశం ఉండటం లేదని పార్లమెంటులో సైతం ఆందోళన వ్యక్తమైంది. తమిళనాడు ఎంపీ కార్తి చిదంబరం ఇటీవల లోక్సభలో మాట్లాడుతూ, "ట్రాన్స్యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ మనందరి క్రెడిట్ చరిత్ర ఆధారంగా రేటింగ్ ఇస్తోంది. కానీ వారు మన క్రెడిట్ హిస్టరీని సరిగా అప్డేట్ చేస్తున్నారో లేదో తెలియదు. ఇందులో పారదర్శకత కొరవడింది. పొరపాట్లపై అప్పీల్ చేసుకునేందుకు సరైన మార్గం కూడా లేదు" అని పేర్కొన్నారు.
మరోవైపు, తమ సిబిల్ స్కోర్ను గూగుల్ పే లేదా ఇతర పోర్టల్స్లో తనిఖీ చేసిన తర్వాత బజాజ్ ఫైనాన్స్, పైసాబజార్ వంటి సంస్థల నుంచి స్పామ్ కాల్స్ అధికంగా వస్తున్నాయని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కేవలం స్కోర్ వివరాలు తెలుసుకున్నందుకే ప్రీ-అప్రూవ్డ్ లోన్ల కోసం పదేపదే ఫోన్లు వస్తున్నాయని వారు వాపోతున్నారు.
ఈ సమస్యల నేపథ్యంలో, తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారిని కేవలం సిబిల్ స్కోర్ లేదన్న కారణంతో తిరస్కరించవద్దని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. "తొలిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులను, వారికి క్రెడిట్ చరిత్ర లేనందున తిరస్కరించరాదని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసింది" అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా వెల్లడించారు.
వ్యక్తులు, సంస్థల రుణ చరిత్రను నమోదు చేసే సిబిల్ ఇచ్చే స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలు, క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ నియామకాల్లో సైతం ఇది కీలకం పాత్ర పోషిస్తోంది. ఇటీవల మద్రాస్ హైకోర్టు, ఎస్బీఐలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి నియామకాన్ని ప్రతికూల క్రెడిట్ రిపోర్టు కారణంగా రద్దు చేయడాన్ని సమర్థించింది. ఆర్థిక నిర్వహణ సక్రమంగా లేని వ్యక్తి ఇతరుల డబ్బును బాధ్యతగా చూసుకోలేరని కోర్టు వ్యాఖ్యానించింది.
సిబిల్ పనితీరులో పారదర్శకత లోపించిందని, నివేదికల్లోని తప్పులను సరిదిద్దుకోవడానికి వినియోగదారులకు సరైన అవకాశం ఉండటం లేదని పార్లమెంటులో సైతం ఆందోళన వ్యక్తమైంది. తమిళనాడు ఎంపీ కార్తి చిదంబరం ఇటీవల లోక్సభలో మాట్లాడుతూ, "ట్రాన్స్యూనియన్ అనే ప్రైవేట్ సంస్థ మనందరి క్రెడిట్ చరిత్ర ఆధారంగా రేటింగ్ ఇస్తోంది. కానీ వారు మన క్రెడిట్ హిస్టరీని సరిగా అప్డేట్ చేస్తున్నారో లేదో తెలియదు. ఇందులో పారదర్శకత కొరవడింది. పొరపాట్లపై అప్పీల్ చేసుకునేందుకు సరైన మార్గం కూడా లేదు" అని పేర్కొన్నారు.
మరోవైపు, తమ సిబిల్ స్కోర్ను గూగుల్ పే లేదా ఇతర పోర్టల్స్లో తనిఖీ చేసిన తర్వాత బజాజ్ ఫైనాన్స్, పైసాబజార్ వంటి సంస్థల నుంచి స్పామ్ కాల్స్ అధికంగా వస్తున్నాయని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కేవలం స్కోర్ వివరాలు తెలుసుకున్నందుకే ప్రీ-అప్రూవ్డ్ లోన్ల కోసం పదేపదే ఫోన్లు వస్తున్నాయని వారు వాపోతున్నారు.
ఈ సమస్యల నేపథ్యంలో, తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారిని కేవలం సిబిల్ స్కోర్ లేదన్న కారణంతో తిరస్కరించవద్దని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. "తొలిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులను, వారికి క్రెడిట్ చరిత్ర లేనందున తిరస్కరించరాదని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసింది" అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా వెల్లడించారు.