ఎరువుల బ్లాక్ మార్కెట్పై చంద్రబాబు సీరియస్.. ధరలు పెంచితే కఠిన చర్యలే!
- ఎరువుల సరఫరా, ధరలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
- ధరలు పెంచే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
- బ్లాక్ మార్కెట్ను అరికట్టి, యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని సూచన
- క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని స్పష్టం
- ప్రైవేటుకు కోటా తగ్గించి, మార్క్ఫెడ్ ద్వారా సరఫరా పెంచాలని నిర్ణయం
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు వ్యవసాయ, విజిలెన్స్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలు, సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం, యూరియాను వ్యవసాయేతర పనులకు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎరువులను పక్కదారి పట్టిస్తే, వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని తేల్చిచెప్పారు.
క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలను ముమ్మరం చేసి, ఎప్పటికప్పుడు యూరియా నిల్వలను పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రైవేటు డీలర్లకు కేటాయింపులు తగ్గించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరాను గణనీయంగా పెంచాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన పునరుద్ఘాటించారు.