Chandrababu Naidu: టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటు... సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ప్రతి కమిటీలో 34 మంది
- అభిప్రాయాల సేకరణకు ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీ
- వివిధ వర్గాల కోసం 54 సాధికార సమితుల ఏర్పాటుకు నిర్ణయం
- పార్టీ బలోపేతమే లక్ష్యంగా భారీ కసరత్తు
టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ కమిటీల నిర్మాణం, సభ్యుల నియామకంపై కీలక చర్చలు జరిగాయి.
పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులతో సహా మొత్తం 34 మంది సభ్యులు ఉంటారు. అలాగే, కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, మీడియా కార్యదర్శులకు కూడా ఈ కమిటీల్లో స్థానం కల్పించారు.
అదేవిధంగా, 28 మందితో పార్లమెంట్ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించనున్నారు. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి 54 సాధికార సమితులను పార్లమెంట్ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల ఏర్పాటులో పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మరియు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ సేకరించనుంది.
ఈ సమావేశంలో 75 మంది నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. పార్టీ బలోపేతం కోసం ఈ కమిటీల ఏర్పాటు కీలకమని, సమర్థవంతమైన నిర్వహణతో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం.



పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులతో సహా మొత్తం 34 మంది సభ్యులు ఉంటారు. అలాగే, కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, మీడియా కార్యదర్శులకు కూడా ఈ కమిటీల్లో స్థానం కల్పించారు.
అదేవిధంగా, 28 మందితో పార్లమెంట్ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించనున్నారు. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి 54 సాధికార సమితులను పార్లమెంట్ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల ఏర్పాటులో పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మరియు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ సేకరించనుంది.
ఈ సమావేశంలో 75 మంది నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. పార్టీ బలోపేతం కోసం ఈ కమిటీల ఏర్పాటు కీలకమని, సమర్థవంతమైన నిర్వహణతో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం.


