టీవీ సీరియల్ కోసం భర్తతో గొడవ.. కుమారుడితో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం
––
ఇదికాస్తా భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. శుక్రవారం ఉదయం కూడా గొడవ పడిన భర్త పొలం పనుల కోసం బయటకు వెళ్లాడు. భర్తతో గొడవ కారణంగా మనస్తాపం చెందిన భార్య ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడికీ తాగించింది. కుటుంబ సభ్యులు గమనించి ఇద్దరినీ మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటోందని, బాలుడి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.