ధర్మస్థల కేసులో అనూహ్య మలుపు.. ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన సిట్!
- సామూహిక అత్యాచారాలు, హత్యలపై ఆరోపణలు
- ఆరోపణలన్నీ కల్పితమని తేల్చిన అధికారులు
- గంటల తరబడి విచారణ అనంతరం అరెస్ట్
గత కొంతకాలంగా, తన ముఖం బయటపడకుండా ముసుగు ధరించి ఒక వ్యక్తి ధర్మస్థలలో ఘోరాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అతడిని విచారణకు పిలిచింది. గంటల తరబడి సాగిన విచారణలో అతడు చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేదని అధికారులు గుర్తించారు.
తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పాటు, చెప్పినవన్నీ కట్టుకథలని విచారణలో తేలింది. దీంతో, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారన్న కారణంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ అరెస్ట్తో ధర్మస్థల కేసు అనూహ్య మలుపు తీసుకుంది.