సోషల్ మీడియా ఫేక్ ఖాతాలపై మహేశ్బాబు కుమార్తె సితార వార్నింగ్
- తన పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు
- అభిమానులను, స్నేహితులను హెచ్చరించిన సితార
- ఇన్స్టాగ్రామ్లో మాత్రమే అధికారిక ఖాతా ఉందని వెల్లడి
- ఇతర ప్లాట్ఫామ్లలోని ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని సూచన
ఈ విషయంపై సితార తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "నా పేరు మీద అనేక నకిలీ, స్పామ్ ఖాతాలు సృష్టిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ నేను చెప్పేది ఒక్కటే. నేను కేవలం ఇన్స్టాగ్రామ్లో మాత్రమే యాక్టివ్గా ఉంటాను. ఇది మాత్రమే నా అధికారిక ఖాతా. వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ నేను లేను. దయచేసి నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలతో జాగ్రత్తగా ఉండండి" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
సితార తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎంతో చురుగ్గా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అప్డేట్స్, వివిధ బ్రాండ్స్తో తన కొలాబరేషన్స్కు సంబంధించిన వివరాలను తరచూ పంచుకుంటూ ఉంటారు. తండ్రి మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రంలోని 'పెన్నీ' పాట ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.