Rahul Gandhi: ఎలక్షన్ కమిషనర్ పై ఇండియా కూటమి కీలక నిర్ణయం!

India Alliance to move resolution against CEC over Rahul Gandhi ultimatum
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలంటూ పార్లమెంట్ లో కూటమి తీర్మానం!
  • ఓట్ చోరీ ఆరోపణలతో ముదిరిన వివాదం
  • రాహుల్ గాంధీకి వారం రోజుల అల్టిమేటం జారీ చేసిన సీఈసీ
ఎలక్షన్ కమిషన్, ఇండియా కూటమి మధ్య వివాదం ముదురుతోంది. రాహుల్ గాంధీకి వారం రోజులు గడువుతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అల్టిమేటం జారీ చేయడంపై ఇండియా కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో సీఈసీని తొలగించాలని పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఈసీని పదవిలో నుంచి తొలగించాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే పద్ధతే పాటించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. మూడింట రెండొంతుల సభ్యుల మెజారిటీతో పార్లమెంట్ తీర్మానం పాస్ చేయాల్సి ఉంటుంది. మిస్ బిహేవియర్ లేదా సదరు బాధ్యతల నిర్వహణకు అర్హత లేదని నిరూపణ అయితే సీఈసీని పదవి నుంచి తొలగించవచ్చు.

సీఈసీ అల్టిమేటం..
ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అధికార ఎన్డీయే కూటమి ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర వివాదం రేపాయి. ఈ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఓట్ చోరీ అనే పదం ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించింది. ఎన్నికల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించడంతో పాటు డిక్లరేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇందుకు ఏడు రోజులు గడువు ఇస్తూ ఆలోగా డిక్లరేషన్ ఇవ్వకుంటే తన ఆరోపణలు తప్పని ఒప్పుకుంటూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీకి అల్టిమేటం జారీ చేశారు.
Rahul Gandhi
Election Commission
India Alliance
CEC Gyanesh Kumar
Parliament
Supreme Court
Vote rigging allegations
Indian Elections 2024
NDA alliance
Election irregularities

More Telugu News