Param Sundari: ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ట్రైలర్
- జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా ‘పరమ్ సుందరి’
- మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మాణం.. తుషార్ జలోటా దర్శకత్వం
- ఈ నెల 29న విడుదల కానున్న సినిమా
- తాజాగా మూవీ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేసిన మేకర్స్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్పై దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు.
ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇక, ఈ ట్రైలర్ చూస్తుంటే పంజాబీ యువకుడు, మలయాళీ యువతి మధ్య సాగే ప్రేమకథాగా సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ భావోద్వేగాలతో కూడిన ఈ ట్రైలర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, 'దేవర'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన 'పెద్ది' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇక, ఈ ట్రైలర్ చూస్తుంటే పంజాబీ యువకుడు, మలయాళీ యువతి మధ్య సాగే ప్రేమకథాగా సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ భావోద్వేగాలతో కూడిన ఈ ట్రైలర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, 'దేవర'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన 'పెద్ది' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.