Cat Kumar: బీహార్లో మరో షాకింగ్ ఘటన.. పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు!
- బీహార్లో చిత్ర విచిత్రమైన ఘటనలు
- ఇటీవల ‘డాగ్ బాబు’ పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు
- ఇద్దరు అధికారులపై శాఖాపరమైన చర్యలు
బీహార్లో జరుగుతున్న చిత్రవిచిత్రమైన ఘటనలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాయి. రోహతాస్ జిల్లాలో ఒక పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది. ఈ దరఖాస్తులో దరఖాస్తుదారుడి పేరుగా ‘క్యాట్ కుమార్’ అని, తండ్రి పేరుగా ‘క్యాటీ బాస్’ అని, తల్లి పేరుగా ‘కటియా దేవి’ అని పేర్కొన్నారు.
అసాధారణమైన ఈ దరఖాస్తును గుర్తించిన రోహతాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదితా సింగ్ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై నస్రిగంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని సూచించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి నకిలీ దరఖాస్తులు బీహార్లో వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని వారాల క్రితం, ఇదే తరహాలో రెండు నకిలీ దరఖాస్తులు దాఖలయ్యాయి. పట్నాలో ‘డాగ్ బాబు’ అనే కుక్క పేరిట నివాస ధ్రువీకరణ పత్రం కావాలంటూ దరఖాస్తు చేశారు. ఈస్ట్ చంపారన్లో ‘సోనాలికా ట్రాక్టర్’ పేరుతో ఒక ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేశారు. ఈ ఘటనల తర్వాత విచారణ జరిపి, ఈ ప్రక్రియను పర్యవేక్షించిన ఇద్దరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
బీహార్ రైట్ టు పబ్లిక్ సర్వీస్ యాక్ట్ ప్రకారం ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి దరఖాస్తును అధికారులు తనిఖీ చేసి, సరిచూసిన తర్వాతే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే, ఇలాంటి నకిలీ దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకుంటున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ఘటనపై ప్రభుత్వ ఉద్యోగుల పనికి ఆటంకం కలిగించడం వంటి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ఈ నకిలీ దరఖాస్తుల వెనుక ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని అభియోగాలు నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
అసాధారణమైన ఈ దరఖాస్తును గుర్తించిన రోహతాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదితా సింగ్ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై నస్రిగంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని సూచించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి నకిలీ దరఖాస్తులు బీహార్లో వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని వారాల క్రితం, ఇదే తరహాలో రెండు నకిలీ దరఖాస్తులు దాఖలయ్యాయి. పట్నాలో ‘డాగ్ బాబు’ అనే కుక్క పేరిట నివాస ధ్రువీకరణ పత్రం కావాలంటూ దరఖాస్తు చేశారు. ఈస్ట్ చంపారన్లో ‘సోనాలికా ట్రాక్టర్’ పేరుతో ఒక ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేశారు. ఈ ఘటనల తర్వాత విచారణ జరిపి, ఈ ప్రక్రియను పర్యవేక్షించిన ఇద్దరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
బీహార్ రైట్ టు పబ్లిక్ సర్వీస్ యాక్ట్ ప్రకారం ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి దరఖాస్తును అధికారులు తనిఖీ చేసి, సరిచూసిన తర్వాతే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే, ఇలాంటి నకిలీ దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకుంటున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ఘటనపై ప్రభుత్వ ఉద్యోగుల పనికి ఆటంకం కలిగించడం వంటి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ఈ నకిలీ దరఖాస్తుల వెనుక ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని అభియోగాలు నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు.