పాక్ ఆర్మీ చీఫ్ నోట మళ్లీ అవే మాటలు.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బెదిరింపులు!
- అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్
- తమది అణ్వాయుధ దేశమని గుర్తు చేసిన వైనం
- సింధునదిపై భారత్ డ్యాములు నిర్మిస్తే క్షిపణులతో పేల్చేస్తామని ప్రేలాపనలు
- తాము నాశనం అవుతూనే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరిక
సింధునది వివాదంపై మునీర్ మాట్లాడుతూ, ఆ నదిపై భారత్ డ్యామ్లు నిర్మించే వరకు ఎదురు చూస్తామని చెప్పారు. తమ వద్ద క్షిపణులకు ఎలాంటి కొదవ లేదని, ఆ డ్యామ్లను పది క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు. భారత్ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఏర్పడితే, తాము నాశనం అవుతూనే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పుకొచ్చారు.