విమానంలో సీటు శుభ్రంగా లేదని ఇండిగోకు రూ.1.5 లక్షల జరిమానా
- తన సీటు అపరిశుభ్రంగా ఉందంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించిన ప్రయాణికుడు
- ఎయిర్ లైన్స్ తీరుతో మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదు
- సేవా లోపం కిందికే వస్తుందంటూ జరిమానా విధించిన ఫోరం
అయితే, సీటు బాగాలేదని పింకీ ఫిర్యాదు చేయడంతో ఆమెకు వేరే సీటు కేటాయించామని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ఆ సీటులో కూర్చుని పింకీ ఢిల్లీకి చేరుకుందని తెలిపింది. ఈ వాదనను వినియోగదారుల ఫోరం పరిగణనలోకి తీసుకోలేదు. టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు సరైన సదుపాయాలు కల్పించడం ఎయిర్ లైన్స్ కంపెనీల విధి అని, ఈ విషయంలో ఇండిగో సంస్థ విఫలమైందని తేల్చింది. పింకీ ఎదుర్కొన్న మానసిక వేదనకు, ప్రయాణంలో ఆమెకు కలిగిన అసౌకర్యానికి రూ.1.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతోపాటు మరో రూ.25 వేలు లీగల్ ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.