ఘనాలో కూలిన హెలికాప్టర్.. ఇద్దరు మంత్రుల సహా కీలక అధికారుల దుర్మరణం
- రక్షణ మంత్రి, పర్యావరణ మంత్రి సహా మొత్తం ఎనిమిది మంది మృతి
- టేకాఫ్ అయిన కాసేపటికే కమ్యూనికేషన్ కట్
- సాంకేతిక లోపంతోనే కూలినట్లు ప్రకటించిన ప్రభుత్వం
కాసేపటికే హెలికాప్టర్ తో కమ్యూనికేషన్ తెగిపోయిందని, ఆ తర్వాత హెలికాప్టర్ కూలిపోయిందనే సమాచారం అందిందని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్న వారంతా చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను వెలికి తీసి ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, నిపుణుల బృందం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని వివరించారు. సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదాన్ని ఘనా ప్రభుత్వం జాతీయ విషాదంగా ప్రకటించింది.