Raj Kasireddy: లిక్కర్ స్కామ్ నిందితుడు కసిరెడ్డికి అస్వస్థత... జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు
- ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏ1 నిందితుడు రాజ్ కసిరెడ్డి
- విజయవాడ జైల్లో ఉన్న కసిరెడ్డి
- కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్న వైనం
ఏపీలో లిక్కర్ స్కామ్ రాజకీయ ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. వీరిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు కూడా ఉన్నారు. అరెస్టయిన వారందరూ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి (ఏ1) విజయవాడ జైల్లో ఉన్నారు. ఆయన ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి (ఏ1) విజయవాడ జైల్లో ఉన్నారు. ఆయన ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు.