Donald Trump: రష్యా నుంచి మీరూ కొంటున్నారుగా.. భారత్ ప్రశ్నకు నీళ్లు నమిలిన ట్రంప్!
- రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
- భారత ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు పెంచుతామని వ్యాఖ్య
- అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం, ఎరువులు కొంటోందని భారత్ కౌంటర్
- భారత్ వాదనపై స్పందించిన ట్రంప్.. ఆ విషయం తనకు తెలియదని వ్యాఖ్య
- దీనిపై విచారణ జరిపాకే మాట్లాడతానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అదే సమయంలో తమ దేశం రష్యా నుంచి చేస్తున్న దిగుమతులపై మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి అమెరికా కూడా యురేనియం, ఎరువులు వంటివి కొనుగోలు చేస్తోందన్న భారత్ వాదనపై స్పందిస్తూ, "ఆ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. దానిపై నేను ఒకసారి చెక్ చేయాలి" అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని, లేదంటే భారత ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు (సుంకాలు) పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. "రాబోయే 24 గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆయన ఆరోపించారు.
అయితే, ట్రంప్ హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. ఒకవైపు భారత్ను విమర్శిస్తూనే, మరోవైపు అమెరికా స్వయంగా రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు, రసాయనాలు వంటి కీలక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని భారత్ ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలోనే ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ పైవిధంగా స్పందించారు.
తమ దేశ జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగానే తాము రష్యా నుంచి చమురు కొనాల్సి వస్తోందని గుర్తు చేసింది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు తొలుత అమెరికాయే తమను ప్రోత్సహించిందని కూడా భారత్ వాదించింది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్యం, ఇంధన భద్రత, భౌగోళిక రాజకీయాల మధ్య ఉన్న సంక్లిష్టతను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని, లేదంటే భారత ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు (సుంకాలు) పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. "రాబోయే 24 గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చు" అని ఆయన వ్యాఖ్యానించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆయన ఆరోపించారు.
అయితే, ట్రంప్ హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. ఒకవైపు భారత్ను విమర్శిస్తూనే, మరోవైపు అమెరికా స్వయంగా రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు, రసాయనాలు వంటి కీలక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని భారత్ ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలోనే ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ పైవిధంగా స్పందించారు.
తమ దేశ జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగానే తాము రష్యా నుంచి చమురు కొనాల్సి వస్తోందని గుర్తు చేసింది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు తొలుత అమెరికాయే తమను ప్రోత్సహించిందని కూడా భారత్ వాదించింది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్యం, ఇంధన భద్రత, భౌగోళిక రాజకీయాల మధ్య ఉన్న సంక్లిష్టతను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.