Tollywood Strike: టాలీవుడ్లో సమ్మె సైరన్.. రేపటి నుంచి నిలిచిపోనున్న షూటింగ్లు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం నుంచి టాలీవుడ్లో అన్ని సినిమా షూటింగ్లు నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరుకాబోమని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.
ఫెడరేషన్ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను మీడియా ముందుంచారు. కార్మికుల వేతనాలను తక్షణమే 30 శాతం పెంచాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలని మరో కీలకమైన షరతు విధించారు. ఈ నిబంధనలకు అంగీకరించిన నిర్మాతలకు చెందిన సినిమా పనుల్లో మాత్రమే తాము పాల్గొంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ కు సమ్మె నోటీసు అందజేశారు.
పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రస్తుత వేతనాలతో జీవించడం కష్టంగా మారిందని, అందుకే వేతనాల పెంపు తప్పనిసరి అని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలు దఫాలుగా నిర్మాతలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకే మొగ్గు చూపినట్లు తెలిపారు.
ప్రస్తుతం టాలీవుడ్లో పలు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు అనేక సినిమాలు సెట్స్పై ఉన్నాయి. ఈ ఆకస్మిక సమ్మె కారణంగా షూటింగ్లతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోనున్నాయి. దీనివల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమస్య పరిష్కారానికి నిర్మాతల మండలి, ఫెడరేషన్ మధ్య త్వరలోనే చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఫెడరేషన్ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను మీడియా ముందుంచారు. కార్మికుల వేతనాలను తక్షణమే 30 శాతం పెంచాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలని మరో కీలకమైన షరతు విధించారు. ఈ నిబంధనలకు అంగీకరించిన నిర్మాతలకు చెందిన సినిమా పనుల్లో మాత్రమే తాము పాల్గొంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ కు సమ్మె నోటీసు అందజేశారు.
పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రస్తుత వేతనాలతో జీవించడం కష్టంగా మారిందని, అందుకే వేతనాల పెంపు తప్పనిసరి అని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలు దఫాలుగా నిర్మాతలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకే మొగ్గు చూపినట్లు తెలిపారు.
ప్రస్తుతం టాలీవుడ్లో పలు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు అనేక సినిమాలు సెట్స్పై ఉన్నాయి. ఈ ఆకస్మిక సమ్మె కారణంగా షూటింగ్లతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోనున్నాయి. దీనివల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమస్య పరిష్కారానికి నిర్మాతల మండలి, ఫెడరేషన్ మధ్య త్వరలోనే చర్చలు జరిగే అవకాశం ఉంది.