Vijay Ramaraju: ఏపీ స్కూళ్లలో కొత్త నిబంధనలు.. ఇకపై వారికి నో ఎంట్రీ!

AP Govt bans political activities in schools
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో రాజకీయాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విద్యా ప్రాంగణాల్లో రాజకీయ పార్టీల చిహ్నాలు, ప్రచార సామగ్రి ప్రదర్శనను పూర్తిగా నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో అకడమిక్ వాతావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ కొత్త ఆదేశాల ప్రకారం, పాఠశాలల ప్రాంగణాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు, కండువాలు, బ్యానర్లు లేదా పోస్టర్లు వంటి ఎలాంటి ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. అంతేకాకుండా, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) సభ్యులు మినహా ఇతర అనధికార వ్యక్తులు, బృందాలు స్కూళ్లలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు.

కొంతకాలంగా అనధికార వ్యక్తులు పాఠశాలల్లోకి ప్రవేశించి, విరాళాలు లేదా బహుమతులు ఇచ్చే నెపంతో విద్యా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఎవరైనా విరాళాలు లేదా వస్తువులు అందించాలనుకుంటే, వాటిని నేరుగా హెడ్‌మాస్టర్‌కు అందజేయాలని సూచించారు. తరగతి గదుల్లోకి ప్రవేశించడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడటం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా, పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగడాన్ని కూడా కచ్చితంగా నిషేధించారు.

ఫిర్యాదులు, వినతులు లేదా అభ్యర్థనలు ఏవైనా ఉంటే, వాటిని పాఠశాల పరిపాలనా కార్యాలయానికి మాత్రమే సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విషయాల్లో సిబ్బంది, విద్యార్థులతో బయటి వ్యక్తులు నేరుగా సంప్రదించరాదని స్పష్టం చేశారు. ఈ మార్గదర్శకాలను తక్షణమే కఠినంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ఫీల్డ్ ఫంక్షనరీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Go Back to Shorts
Vijay Ramaraju
Andhra Pradesh schools
school politics ban
AP education department
school donations
academic environment
school rules
education policy
Vijay Ramaraju director
school management committee

More Telugu News