Hyderabad School Fees: నర్సరీకి రూ.2.5 లక్షల ఫీజా..!
- ఏబీసీడీలు నేర్చుకోవడానికి నెలకు రూ.21 వేలు
- హైదరాబాద్లోని ఓ స్కూలులో భారీగా ఫీజులు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు
- పిల్లలను మరో స్కూలుకు పంపించాలని అంటున్న నెటిజన్లు
హైదరాబాద్ లోని ఓ ప్రైమరీ స్కూలులో ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతోందని, నర్సరీకి ఏకంగా రెండున్నర లక్షలు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ యూజర్ వాపోయారు. ఏబీసీడీలు నేర్చుకోవడానికి నెలనెలా రూ.21 వేలు చెల్లించాలని తన పోస్టులో పేర్కొన్నారు. ఇంత భారీగా వసూలు చేస్తున్న ఫీజుకు స్కూలు యాజమాన్యం ఎలా న్యాయం చేస్తున్నారని, ఆ స్థాయిలో ఖర్చయ్యేంతగా ఏం నేర్పిస్తున్నారో అంటూ ప్రశ్నించింది. ఫీజుల వివరాలకు సంబంధించిన పేపర్ ను ఫొటో తీసి అనురాధ తివారీ అనే యూజర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం ‘ఎక్స్’ లో వైరల్ గా మారింది.
నర్సరీకి రూ.2.51 లక్షలు, ఒకటి రెండో తరగతులకు రూ.2.91 లక్షలు చొప్పున సదరు స్కూలు వసూలు చేస్తోందని అనురాధ తెలిపారు. ఈ లెక్కన మధ్య తరగతి ప్రజల కష్టార్జితం మొత్తం స్కూలు ఫీజులకు సరిపోయేలా లేదని చెప్పారు. ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టుపై పలువురు యూజర్లు స్పందిస్తూ.. ఇదంతా పెద్ద స్కామ్ గా మారిందని, స్కూలు యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని కొంతమంది వాపోయారు. ప్రభుత్వం ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, దీనికో వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లకు పిల్లలను పంపించకుండా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు.
నర్సరీకి రూ.2.51 లక్షలు, ఒకటి రెండో తరగతులకు రూ.2.91 లక్షలు చొప్పున సదరు స్కూలు వసూలు చేస్తోందని అనురాధ తెలిపారు. ఈ లెక్కన మధ్య తరగతి ప్రజల కష్టార్జితం మొత్తం స్కూలు ఫీజులకు సరిపోయేలా లేదని చెప్పారు. ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టుపై పలువురు యూజర్లు స్పందిస్తూ.. ఇదంతా పెద్ద స్కామ్ గా మారిందని, స్కూలు యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని కొంతమంది వాపోయారు. ప్రభుత్వం ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, దీనికో వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లకు పిల్లలను పంపించకుండా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు.