ఏం కావాలని ఎన్టీఆర్ అడిగితే... డిగ్రీ కాలేజి అడిగాను: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- నర్సీపట్నంలో ఓ నర్సింగ్ కాలేజీలో ల్యాంప్ లైటింగ్ సెర్మనీ
- హాజరైన ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- చదువుకోవడం అంటే తనకు బాగా ఇష్టమని వెల్లడి
ఆ తర్వాత తాను టీడీపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక, ఏం కావాలని ఎన్టీఆర్ అడిగారని అయ్యన్నపాత్రుడు గుర్తుచేసుకున్నారు. అప్పటికి తాను అందరికంటే చిన్న వయసు ఎమ్మెల్యేనని, తనలాగా చదువు కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించి, తన నియోజకవర్గానికి డిగ్రీ కాలేజి అడిగానని వివరించారు. అక్కడ్నించి, నర్సీపట్నంను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో కృషి చేశానని... తన నియోజకవర్గానికి పాలిటెక్నిక్, ఐటీఐ, నర్సింగ్, బీఈడీ కాలేజి... ఇలా పలు విద్యాసంస్థలను తీసుకువచ్చానని అయ్యన్న వెల్లడించారు.