Tammareddy Bharadwaj: 'కన్నప్ప' గురించి నేను మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదే: తమ్మారెడ్డి భరద్వాజ్
- 'కన్నప్ప' సినిమాలో భక్తి ఎక్కడుంది?
- స్టార్స్ లేకపోయినా బాగానే ఆడేది
- మోహన్ బాబుగారు పట్టించుకుంటే బాగుండేది
- వాళ్లిద్దరికీ ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమేనన్న తమ్మారెడ్డి
మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందిన 'కన్నప్ప', ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమాలో శివపార్వతులుగా అక్షయ్ కుమార్ - కాజల్ అస్సలు సెట్ కాలేదనీ, భక్త కన్నప్పలో భక్తి అనేది లేకుండా తీశారంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అంత ఖర్చుపెట్టి తీసిన సినిమాపై అలా మాట్లాడటం కరెక్టు కాదనే విమర్శలను తాజా ఇంటర్వ్యూలో ఆయన కొట్టిపారేశారు.
" కన్నప్ప సినిమాను నేను 8వ రోజున చూశాను. ఆ సినిమాను గురించి 9వ రోజున ఇంటర్వ్యూలో మాట్లాడాను. అది పదో రోజున అంతా చూసి ఉంటారు. అంత గ్యాప్ తర్వాత మాట్లాడటం వలన నష్టం ఏముంటుంది? అయినా ఆ సినిమాను గురించి నేను నేరుగా మోహన్ బాబుగారితో .. మంచు విష్ణుతోనే మాట్లాడాను. స్టార్స్ ఎవరూ లేకపోయినా ఆ సినిమా ఆడి ఉండేదనీ, మీరే దాన్ని యావరేజ్ సినిమా చేశారని అన్నాను" అని చెప్పారు.
"మోహన్ బాబుగారికి డైరెక్షన్ పై కూడా మంచి పట్టు ఉంది. మీరు పట్టించుకుని ఉంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదని కూడా ఆయనతో అన్నాను. శివపార్వతులుగా వాళ్లిద్దరూ వెకిలిగా ఉన్నారు. శివుడే సరిగ్గా లేనప్పుడు భక్తి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది. ఆయనకి బదులు అనామకుడిని పెట్టినా బాగుండేది. శివపార్వతులుగా వాళ్లకి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే. మన వాళ్లకి కూడా మనం చెప్పకపోతే ఎట్లా? అందుకే చెప్పాను " అని అన్నారు.
" కన్నప్ప సినిమాను నేను 8వ రోజున చూశాను. ఆ సినిమాను గురించి 9వ రోజున ఇంటర్వ్యూలో మాట్లాడాను. అది పదో రోజున అంతా చూసి ఉంటారు. అంత గ్యాప్ తర్వాత మాట్లాడటం వలన నష్టం ఏముంటుంది? అయినా ఆ సినిమాను గురించి నేను నేరుగా మోహన్ బాబుగారితో .. మంచు విష్ణుతోనే మాట్లాడాను. స్టార్స్ ఎవరూ లేకపోయినా ఆ సినిమా ఆడి ఉండేదనీ, మీరే దాన్ని యావరేజ్ సినిమా చేశారని అన్నాను" అని చెప్పారు.
"మోహన్ బాబుగారికి డైరెక్షన్ పై కూడా మంచి పట్టు ఉంది. మీరు పట్టించుకుని ఉంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదని కూడా ఆయనతో అన్నాను. శివపార్వతులుగా వాళ్లిద్దరూ వెకిలిగా ఉన్నారు. శివుడే సరిగ్గా లేనప్పుడు భక్తి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది. ఆయనకి బదులు అనామకుడిని పెట్టినా బాగుండేది. శివపార్వతులుగా వాళ్లకి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే. మన వాళ్లకి కూడా మనం చెప్పకపోతే ఎట్లా? అందుకే చెప్పాను " అని అన్నారు.