యూపీలో ఘోరం.. భర్తను సజీవదహనం చేసిన భార్య!
- యూపీలోని బాగ్నత్లో ఘటన
- భర్త సన్నీని సజీవదహనం చేసిన భార్య అంకిత
- అంకితతో పాటు ప్రియుడు అయ్యూబ్, ఆమె మామ సుశీల్, బేబీ అనే వ్యక్తిపై కేసు నమోదు
అనంతరం అతడిని అంకిత పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సన్నీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని మొదట మీరట్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ సన్నీ చనిపోయాడు. మృతుని తండ్రి వేద్పాల్ ఫిర్యాదు మేరకు అంకిత, అయ్యూబ్, బేబీ, సుశీల్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. దాంతో కందేరా గ్రామస్థులు నిరసనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.