TSRTC: హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ 'భారీ' శుభవార్త
- ఆయా బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ
- 16 శాతం నుంచి 30 శాతం వరకు ధరల తగ్గింపు
- గరుడ ప్లస్ బస్సుల్లో అత్యధికంగా 30 శాతం తగ్గింపు
- రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో 16 శాతం మేర తగ్గింపు
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను ప్రకటించింది. ఈ మార్గంలోని బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. ఛార్జీలను 16 శాతం నుండి గరిష్ఠంగా 30 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ రాయితీలు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బుకింగ్లకు వర్తిస్తాయని పేర్కొంది.
'హైదరాబాద్-విజయవాడ మార్గంలో టిక్కెట్లపై భారీ తగ్గింపు' అంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. గరుడ ప్లస్ బస్సుల్లో టిక్కెట్ ధరపై 30 శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో టిక్కెట్లపై 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో 16 శాతం వరకు తగ్గింపు ఉంటుందని వెల్లడించింది.
'హైదరాబాద్-విజయవాడ మార్గంలో టిక్కెట్లపై భారీ తగ్గింపు' అంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. గరుడ ప్లస్ బస్సుల్లో టిక్కెట్ ధరపై 30 శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో టిక్కెట్లపై 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో 16 శాతం వరకు తగ్గింపు ఉంటుందని వెల్లడించింది.